సినీ తారల ‘కబడ్డీ’

Unknown | 22:59 | 0 comments

ఉత్తరాంధ్రను ఆమధ్య కుదిపేసిన హుదుద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ చేబడుతున్న ‘మేము సైతం’ ప్రోగ్రాంలో వివిధ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. ఈ నెల 30న ఈ కార్యక్రమాలు నాన్ స్టాప్ గా జరుగుతాయి. పలువురు తారలు, దర్శకులు, నిర్మాతలు పాల్గొనే ఈ వేడుకలో పలు డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్, స్కిట్స్, క్రికెట్, తంబోలా వంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే, మంచు వారి ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరంతా కలసి కబడ్డీ ఆటను ప్లాన్ చేస్తున్నారట. వీరితో బాటుగా పలువురు హీరోలు, హీరోయిన్లు ఈ కబడ్డీ ఆటలో పాల్గొంటారు.

Category:

0 comments